భీమవరం: స్థానిక సీఎస్ఎన్ కళాశాలలో ఏపీ ఐసెట్ ఉచిత కౌన్సెలింగ్ కేంద్రాన్ని శనివారం సెక్రటరీ, కరస్పాండెంట్ చీడే సత్యనారాయణ ప్రారంభించారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఈనెల 24 నుంచి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల్ల సత్యనారాయణ తెలిపారు. ఈ కేంద్రంలో విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, ఉచితంగా కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చన్నారు. ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని, వచ్చేనెల 7న సీటు కేటాయింపు ఉంటుందన్నారు. కేవీ సత్యనారాయణ, పి.దుర్గాప్రసాద్, టి.లావణ్య తదితరులు పాల్గొన్నారు.


