గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు

Aug 17 2025 7:38 AM | Updated on Aug 17 2025 7:38 AM

గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు

గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు

గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు

భీమడోలు: గంజాయిని తరలిస్తున్న నలుగురు యువకులను భీమడోలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. భీమడోలు సీఐ యూజే విల్సన్‌ శనివారం కేసు వివరాలను వెల్లడిస్తూ.. శుక్రవారం సాయంత్రం ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపుగా వస్తున్న వాహనాలను భీమడోలు పోలీసులు తనిఖీ చేస్తున్నారన్నారు. రెండు బైక్‌లపై ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన మోటూకూరి శామ్యూల్‌, కై కరానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన దిరిసిపాము నిషాంత్‌, ముసళ్లకుంటకు చెందిన చీర రవిబాబు అనుమానాస్పద స్థితిలో పారిపోతుండగా పోలీసులు పట్టుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి రూ. 40 వేల విలువ గల 2.13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వానం చేసుకుని వారిని అరెస్ట్‌ చేసారు. వారిని భీమడోలు సివిల్‌ కోర్టులో హాజరుపర్చగా నిందితులకు రిమాండ్‌ విధించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్ల లోపు వారేనని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement