
రెడ్క్రాస్కు గోల్డ్ మెడల్
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో త్వరలో తలసేమియా పిల్లలకు సెంటర్ ఏర్పాటు చేసి చికిత్స ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ అందించిన మెరుగైన సేవలకు గుర్తింపుగా 2024–25 సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్కు ఎంపికై ందన్నారు. దీనికి కృషి చేసిన జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది అభినందనీయులన్నారు. మే 8న రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. మే 28న భీమవరం రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో తలసేమియా పిల్లలకు సెంటర్ ఏర్పాటును గవర్నర్ ప్రకటించనున్నట్లు తెలిపారు.