
రుణమార్పిడితో లబ్ధి పొందాలి
గీసుకొండ: ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్న రుణభారం తగ్గాలంటే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని చెల్లించి లబ్ధి పొందాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధి సురేశ్ సూచించారు. గీసుకొండ గ్రామపంచాయతీ ఆవరణలో లీగల్ సెల్, జిల్లా లీడ్ బ్యాంకు, వ్యవసాయశాఖ బుధవారం ఏర్పాటు చేసిన రైతు రుణమార్పిడి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు తమ ప్రైవేట్ అప్పుల గురించి బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని, తద్వారా వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు ఇస్తారన్నారు. దీంతో పాత ప్రైవేట్ అప్పులను పూర్తిగా తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును తక్కువ వడ్డీతో సులభ వాయిదాల్లో చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏడీఏ గౌస్హైదర్ మాట్లాడుతూ రైతులకు మేలు చేయడానికే బ్యాంకులు ప్రవేశపెట్టిన డెఫ్ట్ స్వాపింగ్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూబీఐ మేనేజర్ విజయ్, ఏఓ(టి) దయాకర్, గీసుకొండ ఏఓ హరి ప్రసాద్బాబు, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఏఈఓ రజని, సీసీ సుజాత, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
ప్రతినిధి సురేశ్