కొన్నిరోజులుగా వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన మెట్టపంట మొక్కల వేర్లు పోషకాలను సేకరించలేవు. కావున నీటిలో కరిగే ఎరువులను ఉపయోగించి మొక్కల ఆకులపై పిచికారీ చేస్తే పంటను కాపాడుకోవచ్చు. 13–0–45 పొటాషియం నైట్రేట్ లీటర్ నీటిలో పది గ్రాములు కలపాలి. మరో రకం 19–19–19 నత్రజని, భాస్వరం, పొటాష్ను అందిస్తే వడదెబ్బ తిన్న మొక్క త్వరగా కోలుకుంటుంది. ఈ పద్ధతితో పంట ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. – ఆంజనేయులు,
జిల్లా వ్యవసాయ అధికారి, వనపర్తి
●


