సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని అందంగా ముస్తాబుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీహరి మూలమంత్ర హవసం జరిగింది. రాత్రికి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేసి భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, కన్నయ్య స్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు


