
సమీకృతం.. పిల్లర్లకే పరిమితం
మున్సిపల్ కేంద్రాల్లో ప్రజలకు కూరగాయలు, పండ్లు, మాంసం ఒకే దగ్గర విక్రయించాలన్న సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసి సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో అమరచింతలో ఆగమేఘాల మీద చేపట్టిన ఈ పనులు.. ఆ తర్వాత బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ అర్ధంతరంగా వదిలేశారు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా.. పిల్లర్లకే పరిమితమైన సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని
స్థానికులు కోరుతున్నారు. – అమరచింత