
ఐటీ టవర్ పనుల్లో వేగం పెంచండి
వనపర్తి: జిల్లాకేంద్రంలో ఐటీ టవర్ నిర్మాణానికి ప్రతిపాదిత స్థల సర్వే నివేదికను సమర్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం నాగవరం శివారులో ఐటీ టవర్ నిర్మాణానికి ఇదివరకు కేటాయించిన స్థలాన్ని కలెక్టర్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్కుమార్ పరిశీలించారు. స్థలం ఐటీ టవర్ నిర్మాణానికి అనువైనదేనా కాదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు మరోమారు సర్వేచేసి నివేదిక సమర్పించాలని, నిర్మాణం పూర్తయితే యువతకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రమేష్రెడ్డి, సర్వే అధికారులు ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి