విజయనగరం అర్బన్: అఖిల భారత శరీర, అవయవదాతల సంఘం జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని స్థానిక గురజాడ స్కూల్లో శనివారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ చిట్టి రమణారావు, జిల్లా అధ్యక్షులుగా గెద్ద చిరంజీవి, ప్రధాన కార్యదర్శిగా కర్రి సత్యనారాయణ, కోశాధికారిగా గొర్లె చిన్నమనాయుడు, సలహాదారులుగా మమ్ముల తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా దొంతల పాపునాయుడు, సంయుక్త కార్యదర్శులుగా పి.షణ్ముఖరావు, భవాని, ఝాన్సీ, కార్యవర్గ సభ్యులుగా శీరావు శ్రీనివాసరావు, పోలినాయుడు, నయీమ్, డాక్టర్ లెంక రాణికుమారి, టీవీ దుర్గారావు ఉన్నారు.


