గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్ ల మధ్య రైలు పట్టాలపై సుమారు 50నుంచి 55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని విజయనగరం రైల్వే పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ పై సుమారు 5 అడుగుల 3 అంగుళాల పొడవు కలిగి, ఎరుపు రంగు ఛాయతో, పసుపు రంగుపై ఎరుపు, తెలుపు రంగు చిన్న గడుల చీర, ఎరుపు రంగు జాకెట్ ధరించి ఉన్న మహిళ మృతదేహాన్ని కనుగొన్నామని తెలిపారు. మృతురాలి కుడి చేతిపై ఒడిశా భాషలో పచ్చబొట్టు గుర్తు ఉందన్నారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089,94419 62879 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై బాలాజీ రావు కోరారు.


