క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచాలి

Dec 6 2025 7:22 AM | Updated on Dec 6 2025 7:22 AM

క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచాలి

క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచాలి

జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీ వీసీ సుబ్బారావు

డెంకాడ: ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకూ కాకినాడ జేఎన్‌టీయూలో జరగబోయే సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనే జేఎన్‌టీయూ, విజయనగరం గురజాడ విశ్వవిద్యాలయం జట్టు ఉత్తమ ప్రతిభ కనబరచాలని వీసీ వీవీ సుబ్బారావు అన్నారు. ఈ పోటీల్లో గురజాడ విశ్వవిద్యాలయం తరఫున ఆడబోయే వాలీబాల్‌ పురుషుల జట్టు, ఇంటర్‌ కాలేజియేట్‌ టోర్నమెంట్‌ కమ్‌ యూనివర్సిటీ వాలీబాల్‌ పురుషుల జట్టు ఎంపిక పోటీలను చింతలవలసలోని ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం వీసీ వీవీ సుబ్బారావు రిబ్బన్‌కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక పోటీల్లో విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల జట్ల క్రీడాకారులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలన్నారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైఎంసీ శేఖర్‌, టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ సెక్రటరీ, పీడీ రామచంద్రరాజు, క్రీడా సమన్వయకర్త జి.అప్పలనాయుడు, పరిశీలకులు కె.నాగరాజు, పీడీలు, కోచ్‌లు, రిఫరీలు,కళాశాల డీన్‌లు, హెచ్‌ఓడీలు, అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement