అన్ని అర్హతలు ఉన్నా అధికారుల సాంకేతిక తప్పిదాల వల్ల పింఛను అందుకోలేక సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు పలువురు బాధితులు. జీవీఎంసీ 25వ వార్డు శాంతిపురానికి చెందిన కర్రి భారతి (35) భర్త కరోనాతో మరణించగా, అపార్టుమెంట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. వితంతు పింఛను కోసం ఈమె దరఖాస్తు చేయగా, ప్రజా సాధికార సర్వే మ్యాపింగ్లో వేర్వేరు రేషన్ కార్డులు ఉన్నప్పటికీ అత్తగారితో కలిపి చూపించారు. అత్తకు ఇప్పటికే పింఛను వస్తుండటంతో, భారతి దరఖాస్తును అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తన లాంటి నిజమైన అర్హులకు పింఛను మంజూరు చేయాలని కోరుతోంది.


