మహారాణిపేట: విశాఖలో మోడీ టయోటా ఆధ్వర్యంలో సరికొత్త ‘టయోటా హైలక్స్ 2026’వాహనాన్ని శనివారం ఆవిష్కరించారు. బలం, భద్రత, సౌకర్యం, అడ్వెంచర్ లక్షణాలతో రూపొందిన ఈ మోడల్కు ఆటోమొబైల్ ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. నూతన హైలక్స్ 2026లో శక్తివంతమైన 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్తో పాటు 6–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంది. 2డబ్ల్యూడీ, 4 డబ్ల్యూడీ ఆప్షన్లలో లభించే ఈ వాహనం 204 బీహెచ్పీ పవర్, 500 ఎన్ఎం టార్క్ను అందిస్తూ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందని షోరూం ప్రతినిధులు తెలిపారు. భద్రతపరంగా 7 ఎయిర్బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. ఏడీసీపీ నరసింహమూర్తి, మోడీ టయోటా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఆచార్య, సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ ఓవీఎస్ అవినాష్, సేల్స్ మేనేజర్ పాల్గొన్నారు.


