గుర్రాల శిక్షణ పార్కు అవసరమే..! | - | Sakshi
Sakshi News home page

గుర్రాల శిక్షణ పార్కు అవసరమే..!

Dec 25 2025 6:14 AM | Updated on Dec 25 2025 6:14 AM

గుర్రాల శిక్షణ పార్కు అవసరమే..!

గుర్రాల శిక్షణ పార్కు అవసరమే..!

జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రోజ్‌ పార్కులో అర్ధంతరంగా నిలిచిన గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రంను ఎంపీ శ్రీభరత్‌, మేయర్‌ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులు బుధవారం సందర్శించారు. మధ్యలో ఆగిన నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన గుర్రాల శిక్షణ పార్కు అవసరమేనన్నారు. ఇక్కడ గుర్రాల శిక్షణ కేంద్రం పూర్తికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం రూ.6 కోట్లతో దీని ఏర్పాటుకు సంకల్పించిందన్నారు. నెలకు రూ.3 వేలు తక్కువ అద్దెకు నిర్వాహకుడికి ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దాన్ని ఎక్కువ అద్దె వచ్చేలా తాము ప్రయత్నిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement