స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో విద్యుత్‌ టారిఫ్‌ పెంపు | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో విద్యుత్‌ టారిఫ్‌ పెంపు

May 22 2024 6:05 AM | Updated on May 22 2024 6:05 AM

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో ఉన్న కార్మికుల విద్యుత్‌ యూనిట్‌ ధర రూ. 8కు పెంచారు. ఈ మేరకు యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో ఉన్న కార్మికులకు త్రైపాక్షిక ఒప్పందం మేరకు యూనిట్‌ ధర 50 పైసలు ఉండేది. ఇటీవల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు యూనిట్‌ ధర రూ. 8కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యూనిట్‌ ధర పెంపుపై అన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి తమ నిరసన తెలిపాయి. అయినప్పటికీ యూనిట్‌ ధర రూ. 8గా పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement