అభివృద్ధికి కేంద్ర నిధులు
మొయినాబాద్రూరల్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం సర్పంచ్ల ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా శ్రీరామ్నగర్, బాకారం, రెడ్డిపల్లి గ్రామాలలో బాధ్యతలు చేపట్టిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని నూతన పాలకవర్గాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్నగర్ సర్పంచ్ గీతామైపాల్, ఉపసర్పంచ్ సుమలతమెన్రెడ్డి, బాకారం సర్పంచ్ ఎలిగని వెంకటేశ్గౌడ్, రెడ్డిపల్లి మాణిక్యం, మండల ఎంపీడీఓ సంధ్య, ఎంపీఓ వెంకటేశ్వర్రెడ్డి, తహసీల్దార్ గౌతమ్కుమార్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, బీజేపీ నాయకులు చనివెల్లి ప్రభాకర్రెడ్డి, కంజర్ల ప్రకాశ్, తోక అంజన్కుమార్గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి


