పీసీసీ చీఫ్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
బీజేపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్రెడ్డి
ధారూర్: జిల్లాలో బాల్య వివాహాల విముక్తి కోసం సాధన సంస్థ ఆధ్వర్యంలో ఽగురువారం ధారూర్, స్టేషన్ ధారూర్, నాగసముందర్, రాంపూర్, గడ్డమీది గంగారం, అవుసుపల్లి, కొండాపూర్ కలాన్, గట్టెపల్లి, దోర్నాల, రుద్రా రం గ్రామాల్లో విద్యార్థులు, యువకులు ర్యాలీ తీశారు. బాల్య వివాహాలు చేయడం నేర మన్నారు. కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ నర్సింలు, సభ్యులు శ్వేత, గౌరీ, అసీమాబేగం, తౌఫిక్, రోజా, శివలక్ష్మి, కన్యాకుమారి, మమ త, రమేష్, పవన్ పాల్గొన్నారు.
అనంతగిరి: అనంతగిరిగుట్ట ఆలయం వద్ద టెంకాయల విక్రయానికి, వాహనాల పార్కింగ్ కోసం వేలం నిర్వహించనున్నట్లు ఆయల ఈ వో నరేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.వచ్చే ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు (కార్తీక మాసం నెల రోజులు మినహ) టెంకాయలు విక్రయించుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2 లక్షలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని సూచించారు.
దుద్యాల: మండలంలో పారిశ్రామిక వాడ కోసం భూసేకరణ గడువును మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు కలెక్టర్ ప్రతీక్జైన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు గురువారం తహసీల్దార్ కిషన్ తెలిపారు. గత నోటిఫికేషన్ ఈ నెల 29వ తేదీతో ముగుస్తుండటంతో మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. 1,174 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 934 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉండటంతో మరికొంత సమయం పట్టేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు గడువు పొడిగించినట్లు తహసీల్దార్ తెలిపారు.
పీసీసీ చీఫ్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
పీసీసీ చీఫ్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
పీసీసీ చీఫ్ను కలిసిన డీసీసీ అధ్యక్షుడు


