
● సిగ్నల్స్ ఊసేలేదు
కొడంగల్: కొడంగల్ మున్సిపల్ పరిధిలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు. పట్టణం మీదుగా రెండు జాతీయ రహదారులు ఉన్నాయి. ఈ రెండూ కొడంగల్లోని అంబేడ్కర్ చౌరస్తాలో కలుస్తాయి. పట్టణంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ – బీజాపూర్, మహబూబ్నగర్ – చించోలీ జాతీయ రహదారులపై భద్రత కరువైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో సిగ్నల్స్ వ్యవస్థ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో సుమారు పది మంది ప్రమాదాల బారిన పడ్డారు. కొందరు చనిపోగా.. మరికొందరు గాయాలపాలయ్యారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు సంఖ్య కూడా పెరిగింది. పట్టణంలో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. వాహనాలను ఎక్కడ పడితే అక్కడే నిలుపుతున్నారు. వ్యాపార సముదాయల ముందు వాహనాలను ఇష్టారాజ్యంగా నిలపడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్టాండ్ ముందు, వినాయక చౌరస్తాలో ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలు అక్కడే ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.
సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి
జాతీయ రహదారిపై సిగ్సల్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అలాగే ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కొడంగల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎంతో మంది చనిపోతున్నారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. – మురహరి, కొడంగల్ వాసి

● సిగ్నల్స్ ఊసేలేదు