అంబేడ్కర్‌ జయంతిని విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జయంతిని విజయవంతం చేద్దాం

Apr 14 2025 7:14 AM | Updated on Apr 14 2025 7:14 AM

అంబేడ్కర్‌ జయంతిని విజయవంతం చేద్దాం

అంబేడ్కర్‌ జయంతిని విజయవంతం చేద్దాం

తాండూరు టౌన్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాల శుచి, శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. పాత తాండూరు, బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి, విగ్రహానికి జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన హక్కులను ప్రసాదించిన మహనీయుడు అంబేడ్కరుడని కొనియాడారు. ఆ మహనీయుడి అడుగుజాడల్లో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేడు దళిత, ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్‌, కార్యదర్శి భద్రేశ్వర్‌, అధికార ప్రతినిధి వెంకట్‌, పట్టణాధ్యక్షుడు మల్లేశం, పటేల్‌ విజయ్‌, సాయిరెడ్డి శ్రీకాంత్‌, బాలప్ప, రజినీకాంత్‌, దోమ కృష్ణ, కిరణ్‌, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement