
మొక్కలు నాటారు.. సంక్షరణ మరిచారు
నవాబుపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనమహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో అభాసు పాలవుతోంది. ప్రతీ సంవత్సరం లక్ష్యం పెట్టుకుని మొక్కలు నాటి.. సంరక్షణ మాత్రం గాలికి వదిలేస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరిట రోడ్లకు ఇరువవైపులా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో మొక్కలు నాటి వదిలేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా గడ్డి ఏపుగా పెరగడం.. వేసవిలో ఆ గడ్డి ఎండిపోవడం.. ఆకతాయిలు, రోడ్ల పక్కన ఉన్న ౖభూముల రైతులు ఎండిన గడ్డికి నిప్పంటించడంతో గడ్డితో పాటు నాటిన మొక్కలు సతం కాలిబూడిద అవుతున్నాయి. 2019–2024 వరకు మండల వ్యాప్తంగా 25,012 మొక్కలు నాటేందుకు గాను రూ.20,71,725లు వెచ్చించారు.
సంగం మొక్కలు బతికిన దాఖలాలు లేవు
అవెన్యూప్లాంటేషన్లో గత ఐదేళ్లలో అధికారులు 25,012 మొక్కలు నాటగా ప్రస్తుతం సగం మొక్కలయినా బ్రతికిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రతి ఏటా వర్షాకాంలో మొక్కలు నాటడం వేసవిలో కాలిబూడిదవడం పరిపాటిగా మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎల్లకొండ, లింగంపల్లి, పూలపల్లి, వట్టిమీనపల్లి, చిట్టిగిద్ద, గొల్లగూడ, మాదిరెడ్డిపల్లి, నారెగూడ, నవాబుపేట, పులుమామిడి తదితర గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న మొక్కలు కాలిపోయాయి. ప్రతి ఏటా ఇలానే జరుగుతున్న అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదు.
అధికారుల తీరుపై ఆగ్రహం
గతేడాది మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ ప్రతీక్జైన్ రోడ్ల పక్కన కాలిన మొక్కలను చూసి అఽధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఒక్క కారణం చాలదా మీ అందరిని సస్పెండ్ చేయడానికి హెచ్చరించినా అధికారుల్లో తీరుమారలేదని ప్రజలు మండిపడుతున్నారు.
వనమహోత్సవంపై నిర్లక్ష్యపు నీడ
కాలిబూడిదవుతున్న మొక్కలు
పట్టించుకోని అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది

మొక్కలు నాటారు.. సంక్షరణ మరిచారు