
చదువుకు పేదరికం అడ్డుకాదు
తాండూరు టౌన్: ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ నంబర్వన్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించే దిశగా శ్రమించాలన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగడానికి పేదరికం అడ్డురాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది మహోన్నత స్థితికి ఎదిగారని గుర్తుచేశారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దాత వనజ సహకారంతో విద్యార్థులకు బహుమతులు, పరీక్ష ప్యాడ్లు అందజేశారు. మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల రత్నమాల, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కరీమా బేగం, ప్రధానోపాధ్యాయులు శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి
డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
ఘనంగా నంబర్ వన్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం

చదువుకు పేదరికం అడ్డుకాదు