ఎట్టకేలకు తొలగిన విద్యుత్ తీగలు
చిల్లకూరు: ఎట్టకేలకు విద్యుత్ శాఖాధికారులు స్పందించి తీగలు తొలగించారు. గూడూరు పట్టణానికి సమీపంలో కాశీ లే అవుట్లో ఓ భవనం నిర్మాణ పనులకు విద్యుత్ స్తంభం నుంచి నేరుగా విద్యుత్ లైన్లకు వైర్లు తగిలించి, విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న అంశంపై సాక్షి దినపత్రికలో ఆదివారం ‘దర్జాగా విద్యుత్ చౌర్యం’ అనే శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీంతో విద్యుత్ శాఖాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, చౌర్యానికి పాల్పడుతున్న విషయం గుర్తించి స్తంభానికి తగించి ఉన్న వైర్లను తొలగించారు. మరోసారి ఇలా చేస్తే చర్యలు తప్పవని అధికారులు వారిని హెచ్చరించినట్లు తెలిసింది.
ఎట్టకేలకు తొలగిన విద్యుత్ తీగలు


