
నిధుల మంజూరు పత్రాన్ని చూపుతున్న వీసీ ప్రొఫెసర్ రాజారెడ్డి
తిరుపతి ఎడ్యుకేషన్ : శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, బయోటెక్నాలజీ విభాగానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేసినట్లు ఆ వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి తెలిపారు. ఆ వర్సిటీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన దీనికి సంబంధించిన పత్రాన్ని ఆవిష్కరించారు. దేశంలో బయోటెక్నాలజీ రంగంలో పరిశోధన, అభవృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిధులను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.