రైతన్నా.. మీసం తిప్పెయ్‌.. 

Yasangi Paddy Procurement Puvvada Ajay Kumar Celebrates With Farmers Khammam - Sakshi

ధాన్యం కొనుగోలు సంబరాల్లో మంత్రి పువ్వాడ 

ఖమ్మం మయూరి సెంటర్‌: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు. అక్కడికి వచ్చిన ఓ రైతు మీసాలను తిప్పిన మంత్రి.. ‘రైతులు మీసం తిప్పుకుని సగర్వంగా జీవించేలా కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని వ్యాఖ్యానించారు.  
(చదవండి: యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top