కరోనా విషాదం: కేవలం గంట వ్యవధిలోనే ఆ దంపతులు.. | Wife And Husband Died With Covid In Khammam District | Sakshi
Sakshi News home page

కరోనా విషాదం: కేవలం గంట వ్యవధిలోనే ఆ దంపతులు..

Jun 2 2021 9:16 AM | Updated on Jun 2 2021 9:33 AM

Wife And Husband Died With Covid In Khammam District - Sakshi

వైరా(ఖమ్మం): కరోనా కాటుతో కొన్ని గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు బలైన సంఘటన వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో వజనేపల్లి నాగరత్నమ్మ (87) చనిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు ఆమె భర్త నాగేంద్రం (93) కరోనాతో పోరాడుతూ మృత్యువాత పడ్డారు.

వారి కుమారుడు రవి చికిత్స పొందుతున్నాడు. నాలుగు రోజుల కిందట నాగేంద్రం, నాగరత్నమ్మ దంపతులతో పాటు, కుమారుడు రవి కూడా కరోనా బారిన పడ్డారు. ముగ్గురు హోంఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వృద్ధ దంపతుల ఆరోగ్యం విషమించి ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఇలా చనిపోయారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో విషాదం నిండుకుంది.  

చదవండి: Coronavirus: కొడుకా.. వెళ్లిపోయావా..! 

Advertisement
 
Advertisement
Advertisement