
సాక్షి, వికారాబాద్: రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్పై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడిపి కలకలం సృష్టించింది. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా ఆ యువతి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. అయితే, వారిని ఆ యువతి చాకుతో బెదిరించినట్లు తెలిసింది. ఆ యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతి నిర్వాకం కారణంగా గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు.
