కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరణ

TS HC Refuses To Stop Kokapet And Khanamet Lands Auction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రేపు(గురువారం) కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల వేలానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టేయాలని విజయశాంతి హైకోర్టును కోరారు. ఈ విచారణలో భాగంగా భూముల వేలం ఆపేందుకు నిరాకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

నిధుల సమీకరణతోపాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ఈ భూములను వేలం వేస్తున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలియజేశారు. ఈ క్ర​మంలో భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక, అమ్ముకోవడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూబ్యాంక్‌ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top