రాకేశ్‌ మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత

Telangana: Revanth Reddy Comments On TRS And BJP Over Rakesh Died Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో రాకేశ్‌ అనే విద్యార్థి చనిపోవడం బాధాకరమని టీపీసీసీ చీఫ్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్‌ మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని.. ఇది బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు చేసిన హత్య అని శుక్రవారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top