
సాక్షి, హైదరాబాద్: ఎండలు అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే మూడో వారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు తెలిపింది.