సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తెలంగాణలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ దాడులు, దర్యాప్తునకు వీలు కల్పించే ‘సాదారణ సమ్మతి (జనరల్ కన్సెంట్)’ని ఉప సంహరించుకుంది. ఈ మేరకు రహస్యంగా రెండు నెలల కిందే జీవో 51ను జారీ చేసింది. ఎలాంటి నేరాల విషయంలోనైనా తెలంగాణలో దర్యాప్తు చేసేందుకు ప్రతి కేసుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా సమ్మతి తీసుకోవాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సీబీఐ విచారణ జరపాలన్న బీజేపీ విజ్ఞప్తిౖపె హైకోర్టు విచారణ నేపథ్యంలో ఈ జీవో బహిర్గతం కావడం గమనార్హం.
దాడులపై ఊహాగానాల నేపథ్యంలో..
విపక్షాల నేతలు లక్ష్యంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని దేశవ్యాప్తంగా పలు పార్టీలు, ముఖ్యనేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై అత్యధిక శాతం దాడులు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. తెలంగాణలోనూ అదే తరహాలో కేంద్రం దాడులు చేయించనుందని కొన్ని నెలలుగా ఆరోపణలు, ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
టీఆర్ఎస్ ముఖ్యనేతలు సైతం ఈ దిశగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946’కి సంబంధించిన సభ్యులందరికీ గతంలో జారీ చేసిన సాధారణ సమ్మతిని ఉప సంహరించుకుంటూ రాష్ట్ర హోంశాఖ ఆగస్టు 30న రహస్యంగా జీవో 51 జారీ చేసింది.
ఈ చట్టం కిందే సీబీఐ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో సీబీఐకి ప్రవేశాన్ని నిరాకరించినట్టు అయింది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులపై దర్యాప్తు చేసే అధికారాన్ని సైతం సీబీఐ కోల్పోయినట్టే. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థల ఉద్యోగులపై దర్యాప్తు విషయంలో సీబీఐ పాత్రను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోషించాల్సి ఉండనుంది. విపక్షాల నేతలను వేధించడానికి సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండడంతోనే రాష్ట్రంలో సీబీఐకి సమ్మతిని ఉపసంహరించుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఎమ్మెల్యేలకు ఎర కేసు నేపథ్యంలో..
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు, పదవులు ఇస్తామని ఎర వేసి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిని ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ముగ్గురి వెనక బీజేపీ పెద్దలున్నట్టు టీఆర్ఎస్ ఆరోపణలు చేయగా.. అదంతా టీఆర్ఎస్ కుట్ర అని బీజేపీ ప్రత్యారోపణలు చేసింది.
ఈ క్రమంలో కేసు దర్యాప్తును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్కు అప్పగించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ జీవో నం.51 జారీ చేశామని.. సీబీఐ ప్రవేశానికి అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. దీనితో రెండు నెలల కింద రహస్యంగా జారీ అయిన జీవో తాజాగా బహిర్గతమైంది.
రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి ఎందుకు?
కేంద్రం ‘ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–1946’ కింద సీబీఐని ఏర్పాటు చేసింది. సీబీఐ ఢిల్లీ భూభాగం పరిధిలో తమ అధికారాలను వినియోగించుకోవడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. సీబీఐ ఇతర రాష్ట్రాల్లో తమ అధికారాలను అమలు చేసి దాడులు, దర్యాప్తు చేపట్టాలంటే.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో సీబీఐకి అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి.
అవినీతి నిరోధక చట్టం–1998, ఐపీసీలోని కొన్ని సెక్షన్లతోపాటు 63కి పైగా కేంద్ర ప్రభుత్వ చట్టాల్లోని సెక్షన్ల కింద సీబీఐ ఆయా రాష్ట్రాల భూభాగంలో నేరాలపై దర్యాప్తు చేసేందుకు సాధారణ సమ్మతి అవసరం. ఈ సాధారణ సమ్మతిని వెనక్కి తీసుకునే అధికారాన్ని సైతం రాష్ట్రాలకు ఉంటుంది.
చివరిసారిగా తెలంగాణ ప్రభుత్వం 2016లో సెప్టెంబర్ 23న సీబీఐకి సాధారణ సమ్మతి నోటిఫికేషన్ను జారీ చేస్తూ జీవో 160 జారీ చేసింది. ప్రస్తుతం ఆ జీవోతో పాటు గతంలో జారీ చేసిన అన్ని సాధారణ సమ్మతులను ఉపసంహరించుకుంటున్నట్టు జీవో 51లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే దేశంలో 8 రాష్ట్రాలు సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకోగా.. తెలంగాణ 9వ రాష్ట్రంగా మారింది.
తెలంగాణలో సీబీఐకి ‘నో ఎంట్రీ’.. కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం
Published Mon, Oct 31 2022 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement