
కొత్త వాహనాలకు విధి విధానాలు
ఒకడ్రైవర్కు ఒక పర్మిట్ మాత్రమే..
నకిలీ చిరునామాలపై డీలర్లదే బాధ్యత
గ్రేటర్లో 65 వేల కొత్త పరి్మట్లకు మార్గం సుగమం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు పరిధిలో నివాసం ఉండే డ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకొనేందుకు మార్గం సుగమమైంది. కొత్త ఆటోరిక్షాలపై ఆంక్షలను ఎత్తివేస్తూ 65 వేల పరి్మట్లను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు, 10 వేల ఎల్పీజీ ఆటోలు, మరో 10 వేల సీఎన్జీ ఆటో పర్మిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 25వేల ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్ ఆటోలను రిట్రోఫిట్మెంట్లు అమర్చు,కొని ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు కొత్త ఆటో పరి్మట్లపై రవాణా కమిషనర్ కె.సురేంద్రమోహన్ తాజాగా విధివిధానాలు విడుదల చేశారు.
డాక్యుమెంట్లు తప్పనిసరి...
ఆటో కొనుగోలు చేసే వ్యక్తి ఔటర్ పరిధిలో తన అడ్రస్ను నిర్ధారించే రెండు డాక్యుమెంట్లను తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. కొనుగోలుదార్ల అడ్రస్ నిర్ధారణ బాధ్యత డీలర్లదేనని తెలిపారు. దరఖాస్తుదారు పూర్తి వివరాలతో పాటు ఆటో లేదా కారు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పుట్టిన తేదీ, ఔటర్ పరిధిలో రెండు అడ్రస్ ధ్రువీకరణ పత్రాలతో ఆటోరిక్షా డీలర్లను సంప్రదించాలి. ఈ మేరకు డీలర్లు సీఎఫ్ఎస్టీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారుల వివరాలను ఆర్టీఏకు అందజేయాలి. ఇలా డాక్యుమెంట్లతో సహా తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి 24 గంటల్లో ఆర్టీఏ అధికారులు అనుమతులు అందజేస్తారు. అనుమతుల ఆధారంగా డ్రైవర్లు 60 రోజుల్లో కొత్త ఆటోను కొనుగోలు చేయవచ్చు. ఈ గడువు ప్రకారం కొనుగోలు చేయలేకపోతే ఆ అనుమతులకు చెల్లుబాటు ఉండదని కమిషనర్ తెలిపారు. కొత్తగా 65 వేల పరి్మట్లను విడుదల చేసిన దృష్ట్యా పాత పర్మిట్లను రద్దు చేశారు. ఈ మేరకు పాత ఎల్పీజీ, డీజిల్, సీఎన్జీ పర్మిట్లపై కొత్త ఆటోలను కొనుగోలు చేసేందుకు వీలులేదని ఆయన పేర్కొన్నారు.
బ్లాక్ మార్కెట్కు తెరపడేనా?
ఆటో పర్మిట్లు నగరంలోని ఫైనాన్షియర్లకు కాసులు కురిపిస్తున్నాయి. సుమారు 80 వేల పాత ఆటో పరి్మట్లను తమ గుప్పిట్లో పెట్టుకున్న వ్యాపారులు ఒక్కో పరి్మట్ను రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పాత పరి్మట్లపైనే ఆటోడ్రైవర్లు కొత్త ఆటోలను కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఏటా భారీ ఎత్తున అక్రమ వ్యాపారం సాగుతోంది. ప్రభుత్వం ఈసారి ఏకంగా 65 వేల కొత్త ఆటోలకు అనుమతినిచి్చన దృష్ట్యా ఇప్పటికైనా ఫైనాన్షియర్ల దోపిడీ ఆగిపోవాలని ఆటో సంఘాలు ఆకాంక్షిస్తున్నాయి.