TG:గ్రూప్‌-1 ఆపితే చర్యలు తప్పవు: డీజీపీ | Telangana DGP Comments On Group 1 Exam | Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1 పరీక్ష ఆపితే చర్యలు తప్పవు: డీజీపీ వార్నింగ్‌

Oct 19 2024 2:54 PM | Updated on Oct 19 2024 3:11 PM

Telangana DGP Comments On Group 1 Exam

సాక్షి,హైదరాబాద్‌:గ్రూప్ 1 మెయిన్స్  కోసం  బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్‌ తెలిపారు. పరీక్షను అడ్డుకున్నా ఇబ్బందులకు గురిచేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి పబ్లిక్‌కు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు.పరీక్ష నిర్వహించేందుకు హైకోర్టు ఆదేశాలున్నాయని,మీకు అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.

ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత.. అదుపులోకి బండి సంజయ్‌ 

 

Advertisement
 
Advertisement
Advertisement