సీఎస్‌కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు

Telangana: Chief Secretary Appoints Additional Responsibilities As Special Cs In Excise, Commercial Taxes Dept - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎక్సై జ్, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పూ ర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమెకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ ఈ శాఖలను పర్యవేక్షించేవారు. కొత్త సీఎస్‌గా శాంతికుమారి బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఆ రెండు శాఖల బాధ్యతలు ఆమె తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌కు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top