Minister Talasani Srinivas inspects fire accident spot in Secunderabad - Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌.. ఘటనా స్థలానికి మంత్రి తలసాని

Jan 19 2023 2:57 PM | Updated on Jan 19 2023 6:49 PM

Talasani Srinivas Inspected Secunderabad Fire Accident Place - Sakshi

సాక్షి, సికింద్రాబాద్‌: నగరంలోని దక్కన్‌ స్టోర్‌లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంటల కారణంగా భవనంలో దట్టమైన పొగ అలుముకుంది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగి కింద వరకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కాసేపటి క్రితమే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కూడా మంటలు చేలరేగాయి.. మంటలు కాస్తా పక్కనే ఉన్న మరో​ భవనానికి వ్యాపించాయి. ఘటనా స్థలంలో మూడు గంటలుగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

మరోవైపు.. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సహాయక చర్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఫైర్‌ సిబ్బంది నలుగురు వ్యక్తులను కాపాడారు. మరో ఇద్దరు లోపల ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది అని స్పష్టం చేశారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement