Secunderabad: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు | Special Trains From Secunderabad For Dussehra, Train Timings Changed | Sakshi
Sakshi News home page

Secunderabad: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు

Sep 30 2022 8:15 AM | Updated on Sep 30 2022 8:28 AM

Special Trains From Secunderabad For Dussehra, Train Timings Changed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌. రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్‌–సంత్రాగచ్చి (07645/ 07646) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 30న ఉదయం 8.40 గంట లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.25కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–షాలిమార్‌ (07741/07742) స్పెషల్‌ ట్రైన్‌అక్టోబర్‌ 2వ తేదీ ఉదయం 4.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 2.55కు షాలిమార్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  

రేపటి నుంచి రైళ్ల వేళల్లో మార్పులు: అక్టోబర్‌ 1 నుంచి కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు ఆయా రైళ్ల వేళల సమాచారాన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవాలనీ, 139 నెంబర్‌ నుంచి కూడా రైళ్ల వేళల్లో మార్పులను తెలుసుకోవచ్చునని సీపీఆర్వో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement