హైదరాబాద్: ఏసీగార్డ్స్లోని టూవీలర్ మెకానిక్ ఫకృద్దీన్కు ఓ ద్విచక్రవాహనంలో రక్తపింజరి పాము ప్రత్యక్షం కావడంతో భయాందోళనకు గురయ్యాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి శనివారం తన వాహనాన్ని మరమ్మతుకు ఇచ్చాడు. రిపేరు చేసే క్రమంలో డిక్కీలో రక్తపింజరి పాము కనిపించింది. దీంతో ఫకృద్దీన్ మరొకరి సహాయంతో పామును ఖాళీ బాటిల్లోకి పంపించి దూరంగా వదిలేశారు.


