గాంధీభవన్‌లో ‘సదర్‌’ వేడుకలు  | Sadar Celebrations At Gandhi Bhavan In Hyderabad | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌లో ‘సదర్‌’ వేడుకలు 

Nov 2 2021 4:25 AM | Updated on Nov 2 2021 4:25 AM

Sadar Celebrations At Gandhi Bhavan In Hyderabad - Sakshi

దున్నపోతుపైకి ఎక్కి సందడి చేస్తున్న జగ్గారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: దీపావళి సందర్భంగా యాదవ కులస్తులు ఘనంగా జరుపుకునే సదర్‌ పండుగ వేడుకలను సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించారు. యూత్‌కాంగ్రెస్‌ ఆలిండియా కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో పెద్దఎత్తున యాదవులు గాంధీభవన్‌కు వచ్చారు. దున్నపోతుల ప్రదర్శనతో వచ్చిన యాదవులకు కాంగ్రెస్‌ నేతలు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డిలు దున్నపోతులపై ఎక్కి అభివాదం చేస్తూ సందడి చేశారు. పెద్ద సంఖ్యలో యాదవులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలిరావడంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో కొంతసేపు గాంధీభవన్‌లో సదర్‌ కోలాహలం కనిపించింది.   

Advertisement
 
Advertisement
Advertisement