మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | road accident in mahbubnagar | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Aug 15 2025 7:22 AM | Updated on Aug 15 2025 7:34 AM

road accident in mahbubnagar

మహబూబ్‌నగర్‌,సాక్షి: మహబూబ్‌ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై  జడ్చర్లలోని మాచారం ఫ్లైఓవర్‌పై  లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో బస్సు డ్రైవర్‌ ఇద్దరు మహిళలున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులున్నారు.

ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా ప్రేవేట్‌ ట్రావెల్స్‌ బస్సు మితిమీరిన వేగం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement