
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో కుల గణనపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొనసాగుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో ప్రజెంటేషన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, నిపుణుల కమిటీ సభ్యులు కంచె ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.