ఏఐ జనరేటెడ్ ఇమేజ్
సాక్షి, షాబాద్: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా ఏరుగురిని సామూహికంగా హత్య చేశాడో దుర్మార్గుడు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో రాజ్కుమార్ (28) అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి మొత్తం ఆరుగురిని హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజ్కుమార్ తన భార్య సరిత, ఇద్దరు కొడుకులు పరీక్షిత్, రుద్రవాన్స్ లతోపాటు బాధిత బాలిక, బాలిక తల్లి లక్ష్మీ, నానమ్మ రుక్కమ్మలను ఘోరంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ సామూహిక హత్యల ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


