హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రేపు(శనివారం, మార్చి 28వ తేదీ ) జరగాల్సిన ప్రశ్నోత్తర సమయాన్ని రద్దు చేసినట్లు శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రశ్రోత్తర సమయాన్ని రద్దు చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలకు తెలియజేమన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది, కానీ ప్రశ్నోత్తరాలు జరగవు. ఈ నిర్ణయాన్ని బీఏసీలో సమావేశంలో తీసుకున్నారు.


