మహోద్యమంలా గ్రీన్‌ ఇండియా మిషన్‌ ఛాలెంజ్‌

Pullela Gopichand Accepted Government Whip Guvvala Balaraju Challenge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్  స్వీకరించారు. గ్రీన్‌ ఇండియా మిషన్‌ మూడో విడత కార్యాక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్‌ విసిరిన గ్రీన్‌ ఇండియా  ఛాలెంజ్‌ మహోద్యమంలా సాగుతోంది. ఈ నేపథ్యంలో గువ్వుల ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గచ్చిబౌలిలలోని తన అకాడమీ ప్రాంగణంలో పుల్లెల గోపిచంద్ శనివారం‌ మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హరితహారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లతో రాష్ట్రంలో పచ్చదనం బాగా పెరిగిందన్నారు. అంతేగాక ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో కూడా పచ్చదనంపై చాలా అవగాహన పెరిగిందన్నారు. ఇక గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్‌ ప్లేయర్స్‌ సిక్కిరెడ్డి, మేఘన, అరుణ్‌, విష్ణులు మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top