రామ చిలుకకు ఘనంగా అంత్యక్రియలు

People Done Final Rituals Of A Deceased Parrot - Sakshi

ఖమ్మం : కరెంట్‌ షాక్‌తో మృతి చెందిన రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జిల్లాలోని బోనకల్ మండలం రావినూతల గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం హై టెన్షన్ కరెంటు వైర్లపై వాలిన రామచిలుక షాక్‌తో మృతి చెందింది. ఇది చూసిన స్థానికులు చలించి పోయారు. రామచిలుకకు సాంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. రామనామంతో ఉన్న రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించడం వల్ల మంచి కలుగుతుందన్న భావనతో అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ప్రకృతిలో ప్రతీ జీవిపై జాలిని చూపించాలని పశుపక్ష్యాదులపై ప్రేమను కలిగి ఉండాలని జంతు ప్రేమికుడు రావట్ల సత్యనారాయణ అన్నారు. అంతక్రియలు నిర్వహించేటప్పుడు రామ నామాన్ని జపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top