కరోనాతో మునుగోడు తహసీల్దార్ మృతి

సాక్షి, మునుగోడు: కరోనా బారిన పడిన నల్ల గొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ సునంద (58) మృతి చెందారు. పక్షం రోజుల క్రితం వైరస్ బారినపడ్డారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండటంతో ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పది రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె.. శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
(చదవండి: రైల్వే ఉద్యోగి దారుణహత్య)
మరిన్ని వార్తలు