రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు?

Medak: Young Woman Found Missing In Manoharabad - Sakshi

సాక్షి, మనోహరాబాద్‌(మెదక్‌): మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. ఎస్సై రాజుగౌడ్‌ వివరాల ప్రకారం మండలంలోని కాళ్లకల్‌ గ్రామానికి చెందిన షేక్‌ జహంగీర్‌ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతని రెండో కూతురు షేక్‌ జహ్నబీ(21) ఈనెల 24 రాత్రి ఎప్పటిలాగే ఇంట్లో నిద్రపోయింది. 

అయితే కుటుంబ సభ్యులు వేకువ జామున చూసేసరికి జహ్నాబీ ఇంట్లోంచి వెళ్లిపోయింది. బంధువులు, తెలిసినవారి వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. కాగా కాళ్లకల్‌ గ్రామానికి చెందిన వీరబోయిన కృష్ణ మూడో కుమారుడు నాగార్జున్‌తో వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తండ్రి శనివారం ఫిర్యాధు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


స్వప్న

యువతి అదృశ్యం 
పరిగి: ఓ యువతి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని గడిసింగాపూర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయ కిష్టయ్య కూతురు స్వప్న ఈనెల 23న తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డిపై అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి చూడగా అతడు కూడా కనిపించలేదు. మధు సూదన్‌రెడ్డిపై అనుమానంతో యువతి కుటుంబీకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి: భర్త వర్క్‌ ఫ్రం హోమ్‌లో బిజీ.. భార్య బట్టలు ఆరేసేందుకు మిద్దెపైకి వెళ్లడంతో. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top