సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్సిబ్బంది మంటలార్పుతున్నారు. షాపులో ఉన్న సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు
మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు పేలిపోతున్నాయి. పేలుడు శబ్ధాలకు స్థానికులు పరుగులు పెడుతున్నారు. చుట్టుపక్కల నివాస ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 8 ఫైరింజన్లతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


