సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆదివారం అంబర్పేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసింది. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్దే గెలుపు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ఎస్ఐఆర్పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై పోటారం చేసిన వాళ్లకే టికెట్లు. కొందరి ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది’అని ఆరోపించారు.


