సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఆయుధాలు ఒకేసారి చోరీ కాలేదని అధికారులు విచారణలో గుర్తించారు. 3 నెలలుగా ఆయుధాలు ఒక్కొక్కటిగా మాయమైనట్లు తెలిపారు. 4 ఏకే 47 రైఫిల్స్, 2 రైఫిల్స్, 9పిస్టోల్స్ చోరీ జరిగినట్లు గుర్తించారు. 2 వేలకు పైగా బుల్లెట్లు చోరి అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు అధికారులను ఆర్మీ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు.


