పంట పొలాల్లో సంక్రాంతి వేడుక

Kamareddy District Farmers Planted Dhanya Lakshmi In Crop Fields - Sakshi

ధాన్యలక్ష్మిని ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్న రైతులు 

కామారెడ్డి జిల్లాలో 4 మండలాల్లో కొనసాగుతున్న సంప్రదాయం

బిచ్కుంద (జుక్కల్‌): సంక్రాంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలోని 4 మండలాల్లోని రైతులు శుక్రవారం పంట చేలలో ధాన్యలక్ష్మిని ప్రతిష్టించి మొక్కులు తీర్చుకున్నారు. మహారాష్ట్రలో ఉన్న ఈ సంప్రదాయాన్ని ఆ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్‌గల్‌ మండలాల్లో రైతులు పాటిస్తున్నారు. ఈ ఆచారం ప్రకారం సంక్రాంతి రోజున రైతులు ఉదయాన్నే కుటుంబ సమేతంగా ఎడ్లబండి, వాహనాల్లో పంట చేలకు వెళ్తారు.


దేవత ముందు వెలిగించిన దీపాన్ని ఇంటికి తీసుకెళ్తున్న మహిళలు 

పంటచేలలో లక్ష్మీ దేవతను ప్రతిష్టించి పూజిస్తారు. వ్యవసాయరంగంతో ముడిపడి ఉన్న పశువులనూ కొలుస్తారు. 5 రకాల కూరగాయలతో వంటలు, భక్షాలు చేసి నైవేద్యంగా పెట్టి దీపం వెలిగిస్తారు. బంధుమిత్రులతో పంట చేలలో వనభోజనాలు చేస్తారు. దేవత ముందు వెలిగించిన దీపం ఆరిపోకుండా సాయంత్రం గంపలో పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఆ దీపంతో ఇంట్లో దీపాలు వెలిగించి పాడిపంటలు పుష్కలంగా పండాలని వేడుకుంటారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top