ఆగని ‘మాస్టర్‌ప్లాన్‌’ మంటలు

Jagtial Womens Attempt To Suicide Over Master Plan - Sakshi

జగిత్యాలలో పలువురు మహిళల ఆత్మహత్యాయత్నం

జగిత్యాల రూరల్‌: జగిత్యాల జిల్లాకేంద్రంలో మాస్టర్‌­ప్లాన్‌ – 2041 మంటలు ఇంకా కొనసాగు­తున్నా­యి. పట్టణ సమీప గ్రామాల్లోని తమ వ్యవసాయ­భూముల­ను రిక్రి యేషన్, ఇండస్ట్రియ­ల్, సెమీ పబ్లిక్‌­జో­న్లలో చే ర్చుతూ ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ ప్రక­టించారని రైతులు భగ్గుమంటున్నారు. వారంరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తు­న్నా­రు. ఈ క్రమంలో గురువారం కూడా రైతులు పెద్దఎత్తున తరలివచ్చి జగిత్యాల నలువైపులా రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైన వంటావార్పు నిర్వ హించారు.

తాము పండించిన మక్కకంకులను విక్రయిస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలిపారు. హుస్నాబాద్‌ శివారులోని జగిత్యాల–నిజామా­బాద్‌ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు మహిళా­రైతులు పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకు­న్నారు. మాస్టర్‌ప్లాన్‌ నుంచి తమ భూములను తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారులను హెచ్చరిస్తూ. మందు తాగేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసు­లు పురుగు­మందు డబ్బాలను లాక్కున్నా రు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అన్నిచోట్ల ధర్నాలను ఉపసంహరించుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top